హైదరాబాద్: నగరంలోని మొగల్పురాలో (Moghalpura) పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున మొగల్పురాలోని ఓ పురాతన భవనం మొదటి అంతస్తు పైకప్పు కూలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి బాధితులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.