Bachupally | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండురోజులపాటు లేఅవుట్లోని 73 ప్లాట్లను ఆన్లైన్లో విక్రయానికి ఉం చగా, కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు.
ప్లాట్ల విక్రయంతో హెచ్ఎండీఏకు రూ. 116.36 కోట్ల ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా బాచుపల్లి లేఅవుట్ను అభివృద్ధి చేసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి కొనుగోలుదారులకు అప్పగిస్తామని తెలిపారు.