సిటీబ్యూరో: హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇందుకోసం 3 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ‘కంపుకొడుతున్న హుస్సేన్సాగర్’ పేరుతో ఆదివారం ‘నమస్తే’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
హుస్సేన్సాగర్ చుట్టూ మూడు చోట్ల సీవరేజ్ ట్రీట్ ప్లాంట్లు ఉన్నాయని, ఒకటి పికెట్ నాలపై 30ఎంఎల్డీ, బల్కాపూర్ నాలాపై 20 ఎంఎల్డీ, రంగధాముని లేక్ వద్ద మరో 5 ఎంఎల్డీల సామర్థ్యంతో ఎస్టీపీలను ఏర్పాటు చేసి, మురుగునీటిని శుద్ధి చేసి సాగర్లోకి వదులుతున్నామన్నారు. 2012 నుంచే వీటి నిర్మాణం చేపట్టి నిర్వహిస్తున్నామని, అదేవిధంగా హుస్సేన్సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో 7 చోట్ల ఐ అండ్ డీలను ఏర్పాటు చేసి మురుగునీటి పారుదలను పర్యవేక్షిస్తున్నామన్నారు.