మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ): ‘బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేరు’ అనే ‘నమస్తే కథనానికి స్పందన లభించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 112 బస్తీ దవాఖానలకు 18 వాటిల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదన్న కథనానికి వైద్యశాఖ స్పందించింది.
18 బస్తీ దవాఖానల్లో డాక్టర్ల భర్తీకి శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నమోదు కలిగి ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు.