ఓయూ నుంచి బయటకు వెళ్లాలి..
లేకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం
ఓయూ వీసీ రవీందర్ యాదవ్
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాన్ బోర్డర్స్ పదిహేను రోజుల్లో బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 23న ఓయూలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థులు ఉండాల్సిన హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఉంటున్నారని, దీంతో క్యాంపస్లో చదువుకునే విద్యార్థులకు ఆటంకంగా మారుతుందన్నారు. నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నాన్ బోర్డర్స్ను బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట రాజకీయ సభలు, సమావేశాలు పూర్తిగా నిషేధించామని తెలిపారు. అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు.