ఎల్బీనగర్ : మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి (Lakshmareddy) గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ( MLA Sudhir reddy) అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ కొత్తపేట డివిజన్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో బూటకపు హమీలతో కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ను కాదని ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మెజార్టీని అందించడం ద్వారా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, డివిజన్ నాయకులు రాహుల్గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ గౌడ్, మాజీ అధ్యక్షుడు రాగిరి ఉదయ్ గౌడ్, మహేష్ రెడ్డి, గుండుమల్ల పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.