బంజారాహిల్స్,సెప్టెంబర్ 1: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఇతర పార్టీలకు లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసుఫ్గూడ డివిజన్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ రఫీ, మజర్ అలీ, కరీమ్ ఖాన్, అంజాద్, రియాజ్, షాన్ తదితరులు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని కలిసిన వీరంతా తాము టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నామని వారు పేర్కొన్నారు. డివిజన్లో సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మాగంటి సూచించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.