సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని చర్లపల్లిలో నాలుగు రైళ్లకు స్టాపు నిలిపివేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
అలాగే, ఎస్సీఆర్ పరిధిలో కాజీపేట్-బల్హార్ష రైల్వే జంక్షన్ల మధ్య కొనసాగుతున్న మూడో లైను, విద్యుదీకరణ పనుల వల్ల కలిగే అంతరాయం వల్ల ఆయా సెక్షన్ల పరిధిలో ఉన్న ఉప్పల్ రైల్వే స్టేషన్లో స్టాపును జూన్ 1 నుంచి 30 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో ఐదు రైళ్లకు స్టాపు రద్దు చేశామన్నారు.