బంజారాహిల్స్, సెప్టెంబర్ 16: రాత్రి పది గంటల తర్వాత పబ్ల నుంచి శబ్దకాలుష్యం లేకుండా చూడాలంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నగర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 28 పబ్లకు వెళ్లి రాత్రి 10 కల్లా మ్యూజిక్ సిస్టమ్స్ ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే కఠినచర్యలు తీసుకుంటామని వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.