పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, ఏప్రిల్ 30 : ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ రూ.850 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక చెరువు నుంచి మరో చెరువుకు అనుసంధానం చేస్తూ నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఎవరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న 42 గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. తాగునిటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1200కోట్లు కేటాయిస్తే అందులో మహేశ్వరం నియోజకవర్గానికి రూ.200 కోట్లు కేటాయించిన్నట్లు తెలిపారు.
రెండు నెలల్లో ప్రతి కాలనీలో పైపులైన్లు వేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారన్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. 50 సంవత్సరాల వరకు నీటి సమస్యలు రాకుండా ఉండటానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామో శివారు మున్సిపాలిటీల్లో అదే విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు రిజర్వాయర్లు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఒక్కో శ్మశాన వాటికకు కోటి రూపాయలు కేటాయించామన్నారు. కాలనీల్లో ఉన్న పార్కులను అభివృద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
చెరువుల సుందరీకరణ పనులు పరిశీలన
బడంగ్పేట, ఏప్రిల్ 30 : చెరువుల సుందరీకరణ పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోమటికుంట, పోచమ్మకుంట చెరువు సుందరీకరణ పనులను శనివారం సాయంత్రం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు ముత్యాల లలిత కృష్ణ, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్రెడ్డి దర్శన్రెడ్డి, రామిడి రాంరెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సుందరీకరణ పనుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఈ అశోక్రెడ్డి పనితీరు బాలేదన్నారు. వానకాలం లోపు పనులు పూర్తి చేయాలన్నారు. చెరువులోకి వర్షం నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా రెండు చెరువుల సుందరీకరణ పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈ అశోక్రెడ్డి, జ్యోతి, ఏఈఈ రాంప్రసాద్రెడ్డి, తదితరులు ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..
బడంగ్పేట, ఏప్రిల్ 30: ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్నహస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నాదర్గుల్ రాగన్న గూడంకు చెందిన మమతకు మంజూరైన రూ.1.50లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును మంత్రి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవలన్న గొప్ప సంకల్పం సీఎం కేసీఆర్ది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, మర్రి జగన్మోహన్రెడ్డి, జంగయ్య తదితరులు ఉన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణ..
ఆర్కేపురం, ఏప్రిల్ 30 : మే 5వ తేదీన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు అనిల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనీల్రెడ్డి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్గుప్త హాజరవుతున్నట్లు తెలిపారు.