రవీంద్రభారతి, అక్టోబర్ 10: ఆహారాన్ని వృథా చేయకుండా నగరంలోని అన్నార్థులను, పేదలను ఆదుకోవాలని అదనపు డీసీపీ భాస్కర్రావు పేర్కొన్నారు. నో ఫుడ్వేస్ట్ ఫౌండేషన్ సంస్థ 2వ వార్షికోత్సవాన్ని ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర అదనపు డీసీపీ భాస్కర్రావు విచ్చేసి మాట్లాడుతూ.. దేశంలోని చాలా నగరాల్లో నో ఫుడ్వేస్ట్ సంస్థ ఆహారాన్ని వృథాచేయకుండా మిగిలిపోయిన ఆహారాన్ని అన్నార్థులకు అందజేయడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ సమయంలో పేదలు, కూలీలు నడుచుకుంటూ వెళ్తూ అన్నంలేక అలమటించారని, అలాంటి వారికి నో ఫుడ్వేస్ట్ స్వచ్ఛంద సంస్థ భోజనాన్ని అందించిందని కొనియాడారు. మంచి కార్యక్రమం చేపడుతున్న నో ఫుడ్వేస్ట్ సంస్థ వ్యవస్థాపకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దినేశ్, పద్మనాభన్, వెంకటమురళి, మంజులత కళానిధి తదితరులు పాల్గొన్నారు.