హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రవీంద్ర మొక్కను బహుకరించారు. వీసీ సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ సీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియమితులయ్యారు.