మేడ్చల్/జవహర్నగర్/ఘట్కేసర్/శామీర్పేట, జనవరి1: నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ వ్యాప్తం గా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు కేక్ కట్ చేశారు. ఆనందోత్సాహాలతో ఒకరి కొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇండ్ల ఎదుట వాకిళ్లను రంగురంగుల రంగవళ్లులతో అలంకరించారు. సోమవారం ఉదయాన్నే కుటుంబ సమేతంగా వెళ్లి, ఆలయల్లో దైవదర్శనం చేసుకున్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తం గా ఉన్న ఆలయాలు కిటకిటలాడాయి.
మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, ఆలయ అర్చకులు గురుస్వామి కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు చేసి, లక్ష దీపార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో లక్ష దీపాలను ఏర్పాటు చేసి, వెలిగించారు. ఓం స్వస్తిక్, శివలింగం తదితర రూపాల్లో దీపాలను అలకంరించి, లక్ష దీపార్చన చేశారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్నగర్ మేయర్ మేకల కావ్య కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ ప్రజలకు చైర్మన్ కొండల్రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగ య్య యాదవ్ మున్సిపాలిటీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాత్రి పారిశుధ్య కార్మికులతో కలిసి చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్ కేక్ కట్చేశారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని రత్నాయలం, సత్యనారాయణస్వామి ఆలయం, రామాలయం, వెంకటేశ్వర ఆలయం, గాయత్రీ మహాక్షేత్రం, లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.