మణికొండ, జనవరి 4 : విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని బుధవారం ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్కారు బడులలో సకల సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే యూనిఫామ్స్, పుస్తకాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ సర్కారు హయాంలో 1100 గురుకుల పాఠశాలలు, 1450 ఇంటర్ గురుకులాలు, 95 డిగ్రీ కళాశాలలు, 56 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు.
మన ఊరూ-మన బడి కార్యక్రమం ద్వారా 26 వేల పాఠశాలల రూపురేఖలు మారాయని తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఢిల్లీలో సర్కారు బడులపై నివేదిక తెప్పించామని అంతకన్న గొప్పగా ఇక్కడ పాఠశాలలను తీర్చిదిద్దాలను సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టమని అన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీర్చిదిద్దలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కమిషనర్ ఫల్గుణ్కుమార్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మణికొండ, జనవరి 4 : విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని బుధవారం ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్కారు బడులలో సకల సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే యూనిఫామ్స్, పుస్తకాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ సర్కారు హయాంలో 1100 గురుకుల పాఠశాలలు, 1450 ఇంటర్ గురుకులాలు, 95 డిగ్రీ కళాశాలలు, 56 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు.
మన ఊరూ-మన బడి కార్యక్రమం ద్వారా 26 వేల పాఠశాలల రూపురేఖలు మారాయని తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఢిల్లీలో సర్కారు బడులపై నివేదిక తెప్పించామని అంతకన్న గొప్పగా ఇక్కడ పాఠశాలలను తీర్చిదిద్దాలను సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టమని అన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీర్చిదిద్దలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కమిషనర్ ఫల్గుణ్కుమార్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.