రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూన్ 2 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లా కోర్టులు గురువారం ప్రారంభమయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవెన్యూ జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు న్యాయసేవలు మాత్రం ఉమ్మడి జిల్లా కోర్టు పరిధిలోనే కొనసాగాయి.
రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన వికారాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల కోర్టులను గురువారం ప్రారంభించారు. ఇక రంగారెడ్డి జిల్లా కోర్టుతో ఉన్న సంబంధాలు నేటితో ముగిశాయి.