ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 6 : శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. క్రమ శిక్షణ కలిగి ఉండటంతో పాటు పట్టుదలతో కృషి చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని విద్యార్థులకు సూచించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ తదితర విభాగాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సీఈవో నీలిమ, చాన్స్లర్ యు బి దేశాయ్, రిజిస్ట్రార్ బాలాజీ, వైస్ చాన్స్లర్ రామచంద్రం, డైరెక్టర్ అనురాగ్ పల్లా, డీన్లు విజయకుమార్, సుధీర్ రెడ్డి, ముత్తారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శ్రీనివాస్ రావు, ప్లేస్మెంట్ అధికారి మమత పాల్గొన్నారు.