కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల హవా కొనసాగింది. వివిధ క్యాటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిం చి, సత్తాచాటారు. విద్యార్థులు డీ సదాశివరెడ్డి 242వ ర్యాంకు, భూక్యా మణికంఠ 375, ఆర్ రిష్మిత 487, డీ విశ్వనాథ్రెడ్డి 577, వీ రామ్ ప్రణీత్ 597, ఎం సాత్విక్ 607, సీహెచ్ నిస్క్రాంత్రెడ్డి 673, పీ సాయికౌశిక్ 730, పీ సాయిశరణ్ 845, పీ సిద్ధార్థ 1019, బీ నవదీప్ 1382, టీ వెంకటచరణ్రావు 1655, కే ఆర్య 1656, రూపాసింగ్ 2005, కేవీఎస్ఎస్ రేష్మిత 2080,
సీహెచ్ రాజవిఘ్నేశ్ 2088, సీహెచ్ సుప్రీమ్ 2090, ఏ భార్గవ్రెడ్డి 2091, డీ అపూర్వ 2240 ర్యాంకులు
సాధించారు. మొత్తం 28 మం దికి 5 వేలలోపు ర్యాంకులు రాగా, 401 మంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి విద్యార్థులను అభినందించారు. పటిష్ఠ ప్రణాళిక ప్రకారం బోధించడంతోపాటు నిరంతర పర్యవేక్షణతోనే విద్యార్థులు ఘన విజయం సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం గా ఆన్లైన్ తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. అంచనాకు మించి ఫలితాలు రావడం ఆన్లైన్ తరగతులను సక్రమంగా నిర్వహించామనే విషయం స్పష్టమైందన్నారు.