హైదరాబాద్: భాగ్యనగరంలో డ్రగ్స్ కలకలం రేగింది. నార్కొటిక్స్ బ్యూరో అధికారులు హైదరాబాద్ నగరంలో 3 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపించే పార్శిల్లో ఈ డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఈ పార్శిల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో చెన్నైలోని నిందితుడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. దీంతో అధికారులు డ్రగ్స్ సమస్యపై పూర్తిగా ఫోకస్ పెట్టి అనుమానం వస్తే చాలు తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు.