హైదరాబాద్: పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గారావుపై ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని మంగళవారం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు.
ఈ నేపథ్యంలో దుర్గారావును షరతులతో కూడిన బెయిల్ను జడ్జి మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించారు. కాగా, ఈ కేసులో 11 మంది నిందితుల్లో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతడి తండ్రి షకీల్ దుబాయ్లో ఉండటంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.