చాదర్ఘాట్, మార్చి 25 : ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్సూన్ పనుల్లో భాగంగా ఏడాది పాటు పేరుకపోయిన వ్యర్థాలను తీసేందుకు టెండర్లు ఖరారు చేశారు. మేజర్ ఓపెన్ నాలాలు ఆజంపురా, పాతమలక్పేట డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. అధిక శాతం ఆజంపురా డివిజన్ నుంచి నాలాలున్నాయి. మొత్తం నాలాను మూడు భాగాలుగా విభజించి మీటర్ల ప్రాతిపదికన టెండర్లను పిలిచారు. మొదటిది ఏడు గుళ్ల నుంచి ఆజంపురా హెల్త్పోస్ట్, రెండోది ఆజంపురా హెల్త్ పోస్ట్ నుంచి ఆజంపురా ఆర్యూబీ, ఆజంపురా ఆర్యూబీ నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ ఆర్యూబీ వరకు, డబీర్పురా లేబర్ అడ్డా నుంచి ఫర్హత్నగర్ బస్తీ మీదుగా ఒవైసీ బ్రిడ్జి వరకు నాలుగు పనులుగా విడదీసి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు.
అంతర్గత కాలనీ బస్తీల్లో పనులు ప్రారంభం..
ఆజంపురా, చావునీ డివిజన్లలోని అంతర్గత రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో పూడికతీత తీసేందుకు జీహెచ్ఎంసీ లక్షల రూపాయలు వెచ్చిస్తుంది. వ్యర్థాలు జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తూకం ఆధారంగా కాంట్రాక్టర్లకు బిల్లుచెల్లిస్తారు. ఇప్పటికే డబీర్పురా లేబర్అడ్డా నుంచి ఫర్హత్నగర్ ఒవైసీ బ్రిడ్జి వరకు పనులు కొనసాగుతున్నాయ. వానకాలానికి ముందే 80 శాతం పనులు పూర్తి చేసేందుకు అధికారులు టా ర్గెట్ పెట్టుకున్నారు. 0.4 మీటర్ల లోతు మేరకు అంటే అడుగు లోతు వరకు పూడికతీత తీసేందుకు ప్రతిపాదనలు చేశారు. నాలాలో కొన్ని చోట్ల పూడికతీత ఎక్కువ గా ఉంటే ఈ లోతు సామర్థ్యం పెరిగే అవకాశం ఉం టుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
ఆజంపురా డివిజన్లోని ఏడుగుళ్లు నుంచి ఆజంపురా హెల్త్ పోస్ట్ వరకు రూ.7లక్షలు, ఆజంపురా హెల్త్ పోస్ట్ నుంచి ఆజంపురా ఆర్యూబీ బ్రిడ్జి వరకు రూ.4లక్షలు, ఆజంపురా ఆర్యూబీ నుంచి మలక్పేట ఆర్యూబీ వరకు రూ.4 లక్షలు, డబీర్పురా లేబర్ అడ్డా నుంచి ఫర్హత్నగర్ ఓవైసీ బ్రిడ్జి వరకు రూ.9.8 లక్షల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.
మాన్సూన్కు ముందుగానే.. అన్ని ప్రాంతాలో పనులు పూర్తి చేస్తాం
నాలాల పూడికతీత పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. మేజర్ నాలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. బకెట్ డ్రైన్, మ్యానూవల్ డీసిల్టింగ్ పనులను బస్తీల్లో కూడా ప్రారంభించాం. ఈ వేసవికాలంలో నే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– మల్లికార్జున్, ఏఈ