Mysore Sandal Soap | హైదరాబాద్ : నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీ ఉత్పత్తులతో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని సీజ్ చేశారు.
హైదరాబాద్కు చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్ కలిసి ఈ నకిలీ సబ్బులను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్డీఎల్ సంస్థకు మైసూర్ శాండిల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కేఎస్డీఎల్ చైర్మన్ ఎంబీ పాటిల్కు సమాచారం అందింది. దీంతో తెలంగాణ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాజాగా దాడులు నిర్వహించారు.