కవాడిగూడ : ముషీరాబాద్ నియోజక వర్గ అభివృద్దే లక్ష్యంగా తాను శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జయసింహలను హైదర్గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసంలో సింగాడికుంట వాసులు ఘనంగా సత్కరించారు.
కవాడిగూడ డివిజన్లోని సింగాడిగుంట కాలనీ ఎత్తుగా ఉండడంతో తాగునీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని, ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొరవ తీసుకుని నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్కు సింగాడికుంట వాసులు రుణపడి ఉంటారని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కవాడిగూడ సీనియర్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, కరణ్, ఎల్లేష్, ప్రేమ్, కార్తిక్, రవీందర్, సుదర్శన్, చందు, ప్రశాంత్, జె. రాజేశ్, రాజు, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.