కవాడిగూడ, నవంబర్ 18: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు యువత ఆకర్షితులై బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని బీఆర్ఎస్ ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్లోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళన సభను ముషీరాబాద్ నియోజక వర్గం ముఠా జై సింహ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంభకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వల్లాల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి ఉపాధి అవకాశాలు, విదేశీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేక పథకాలను ప్రవేశపట్టిందన్నారు. దీంతో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ మద్దుతునిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ మాట్లాడుతూ, మతతత్వ బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తుగా ఓడించాలన్నారు. యువ సేన నాయకులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి ముఠా గోపాల్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల మధ్య ఉండే ముఠా గోపాల్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్చార్జి శశాంక్, బీఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి దినేష్ చౌదరి, ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఎక్కాల కన్న, మాజీ కార్పొరేటర్లు వి.శ్రీనివాస్ రెడ్డి, ముఠా పద్మ నరేష్, బీఆర్ఎస్ నాయకులు సంగిశెట్టి జగదీష్, సినీ హీరో రోశం బాలు, భోలక్పూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్ కుమార్, జునైద్ బాగ్దాది, షరీపోద్దీన్, మున్వర్ చాంద్, నియోజక వర్గం సోషల్ మీడియా ఇన్చార్జి ముఠా శివ సింహా తదితరులు పాల్గొన్నారు.