రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకున్నారు. ప్రార్థనల అనంతరం స్నేహితులు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలో అధ్యాత్మికత వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ పండుగను శనివారం ముస్లింలు సంతోషంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మక్కామసీదు, మీరాలం ఈద్గా, బడీ మసీదు తదితర చోట్ల ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.