హైదరాబాద్ : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేసి దిగువ మూసీలోకి అధికారులు నీటిని వదులుతున్నారు.
ఉస్మాన్సాగర్లోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లను రెండు అడుగలు మేర ఎత్తి దిగువ మూసీలోకి 960 క్యూసెక్కులను విడుదల చేశారు. హిమాయత్సాగర్లోకి 3500 క్యూసెక్కుల నీరు రాగా, ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు.
రెండు రిజర్వాయర్ల నుంచి 4,460 క్యూసెక్కుల జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.