చౌటుప్పల్, అక్టోబర్ 11: మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 4, 15 వార్డుల్లో మంగళవారం ఆయన గడపగడపకూ వెళ్లి ముమ్మర ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. నాయకులు బత్తుల దాసు, మారగోని ప్రవీణ్, కొంపెల్లి రవి పాల్గొన్నారు.