బడంగ్పేట: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బొడుగుం శ్రీనివాసరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు. వారి కుటుంబానికి మనో దైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.