హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యార్థులకు పర్యావరణ ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శని కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నది. తాజాగా మేడ్చల్ జిల్లా అటవీశాఖ నేతృత్వంలో కీసర రిజర్వ్ ఫారెస్ట్లో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులను కీసర అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అకడ వివిధ రకాల చెట్లు, ఔషధ మొకలను పిల్లలకు అటవీ అధికారులు పరిచయం చేశారు.
పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అడవుల వల్ల ఉపయోగాలు, అడవులపై పెరుగుతున్న ఒత్తిడిని విద్యార్థులకు అర్థం అయ్యేలా వివరించారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న కీసర ఎకో అర్బన్ పార్ను విద్యార్థులు సందర్శించారు. కాగా, విద్యార్థుల వనదర్శిని కార్యక్రమం వివరాలను ట్విట్టర్లో షేర్ చేసిన సంతోష్ కుమార్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. అటవీశాఖ చాలా మంచి పనిచేస్తున్నదని, తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఎకో పార్ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎఫ్వో జానకిరామ్, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో పర్వతారోహకురాలు ఆశా మాలవ్య పాల్గొన్నారు. మహిళా భద్రత, సాధికారతను సమాజంలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ఆశా మాలవ్య.. తన యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒకరు మొకలు నాటాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు, మహిళా సాధికారతకు చేపడుతున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కి ఆశ కృతజ్ఞతలు తెలియజేశారు. తన సైకిల్ యాత్రలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆశను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. తన వంతు సాయంగా కొంత నగదు సాయం అందించారు. భవిష్యత్లో కూడా తన వంతు సహాయం అందిస్తానని సంతోష్కుమార్ భరోసా కల్పించారు.
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు చిరు ఉద్యోగులకు సైతం సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. అలాగే సంఘటిత, అసంఘిత రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్పు చెందినట్టే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం భారత ప్రైవేట్ ఉద్యోగ్ సంఘ్గా ఏర్పడిందని సంఘం వ్యవస్థాపక అధక్షుడు గందం రాములు ఎంపీ సంతోష్కుమార్కు వివరించారు. సంఘాన్ని ఇప్పటికే 12 రాష్ర్టాలకు విస్తరించామని, భవిష్యత్లో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కమిటీలు వేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కోపౌండర్ రాఘవేంద్రయాదవ్, సినీ దర్శకుడు సంపత్ నంది, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్నాయక్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.