మణికొండ,ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ సుందర్ గార్డెన్స్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఆర్ఎస్ జెండాను ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లకాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.
ఆత్మీయతను చాటుదాం..
తెలంగాణ రాష్ట్రం వస్తే..మీకు స్వపరిపాలన చేతకాదన్న వారికి చెంపపెట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే నిదర్శనమని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆనాటి ఐటీ సెక్టార్ టర్నోవర్ 50వేల కోట్లు కాగా, ప్రస్తుతం 2లక్షల కోట్ల పైగా పెరిగిందన్నారు. కేవలం ఒక్క ఐటీ సెక్టార్లోనే 4.5లక్షల ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మంత్రి కేటీఆర్దేనన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో గండిపేట చెరువు టూరిజం స్పాట్గా అభివృద్ది చెందిందన్నారు. తాము గెలిచిందే కార్యకర్తల వల్ల అని, ఎవరికి ఏ పని ఉన్న జస్ట్ ఫోన్ చేస్తే తాను చేసి పెడతానని ఎంపీ భరోసా ఇచ్చారు. అంతకుముందు ఖమ్మ జిల్లా ఘటనతో మృతులకు నివాళ్లర్పించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే మనల్ని బంఫర్ మెజార్టీతో గెలిపిస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. పార్టీలో ఒడిదుడుకులను గుర్తించి, అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, కౌన్సిలర్లు వసంత్ చౌహాన్, లావణ్యనరేశ్, శైలజ, మాజీ సర్పంచ్ వై.నరేశ్, ఆల్కాలనీ సమాఖ్య అధ్యక్షుడు సీతారాం దూళిపాళ, రాష్ట్ర సీనియర్ నేత కొణతం లక్ష్మణ్గౌడ్, రాష్ట్ర నాయకురాలు కీర్తిలతాగౌడ్, పి.జంగయ్య, సత్యారెడ్డి, ప్రమోద్రెడ్డి, ధన్రాజు, బషీర్, జయరాజ్, కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.