Sabitha Indra Reddy | కందుకూరు, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రజాబలం ఉన్నంత వరకు ఎంత మంది పార్టీలు మారినా.. బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉండదని స్పష్టం చేశారు. కేవలం కొంత మంది స్వార్ధం కోసం పార్టీని మారినంత మాత్రాన ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. గురువారం కందుకూరు మండల కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు కసిగా పని చేసి చేవేళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ముఠా మేస్త్రీని అని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలిపారు. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను విస్మరిస్తుందని మండిపడ్డారు.
కందుకూరులో గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలను ప్రభుత్వం రద్దు చేస్తే అగ్గిపుట్టిస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నదని మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి.. మెచ్చించి జిల్లా మెడికల్ కళాశాలను కందుకూరుకు తీసుకువచ్చానని.., ఆశామాషిగా కళాశాల రాలేదని చెప్పారు. ఫార్మాసిటీ, మెడికల్ కళాశాలను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, వాటిని రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం ఫార్మాసిటీతో పాటు మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
మండల పరిధిలోని సార్లరావుల పల్లి తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. పార్టీలో పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ప్రవీణ్ నాయక్, గోవర్ధన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉపేందర్ నాయక్, దేవేంద్ నాయక్, రాజ్కుమార్, నరేశ్, వెంకటేశ్, రఘు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బాలునాయక్, శ్రీనివాస్, రాజీవ్, మోహన్, బాలు పాల్గొన్నారు.
తన ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్కు అండగా ఉంటానని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. గతంలో కేసీఆర్ పుణ్యమా అని ఎంపీలుగా గెలిచిన వారు నేడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారని, వారికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఇంటింటికి వెళ్లి పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు వేపించాలని కార్యకర్తలకు చూసించారు. కాసానిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. నియోజకవర్గానికి రావాల్సిన నిధులను కోట్లాడి తీసుకు వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ మెంబరు చిలకమర్రి నర్సింహ, మార్కెట్ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి. నియోజకవర్గం ఉపాధ్యక్షులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, ఏజీ అంజయ్యగౌడ్, కాకి దశరథ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, ఎలుక మేఘనాథ్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్. డైరెక్టర్లు ఆనంద్, శేఖర్రెడ్డి, సామ ప్రకాశ్ రెడ్డి, దేవీలాల్ నాయక్, పాండు, ఉపాధ్యక్షులు సామ మహేందర్రెడ్డి, దామోదర్గౌడ్, గుయ్యని సామయ్య, మాజీ సర్పంచ్లు రామకృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, నరేందర్ గౌడ్, గోవర్దన్పరంజ్యోతి, ఇందిరమ్మ, పుల్లారెడ్డి., ప్రవీణ్నాయక్, గోవర్దన్, జంగయ్య, కాకి రాములు, యూత్ నాయకులు తాల్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, యాదయ్య, ప్రశాంత్చారి, మోహన్రెడ్డి, శేఖర్ గుప్తా, సంజీవరెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.