హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి పార్వతి, చిన్నారులు శ్రేయ, తన్వికిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ ఉండటం వల్ల.. పార్వతికి, తన భర్తతో రోజూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఆ గొడవ వల్లనే ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపి పార్వతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తను సూసైడ్ చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.