హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశేఖర్కు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు జన్మనించింది. అయితే, కూతురు పుట్టిందని తరుచూ భర్త వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. భార్య, బిడ్డను చంద్రశేఖరే చంపి ఉంటాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.