హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన నడక నిర్వహించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్’లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల అవగాహన వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ రవీందర్, పోలీసు సిబ్బంది, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.