ఎర్రగడ్డ, అక్టోబర్ 29: ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సీఎం కేసీఆర్ చేతల్లో నిరూపించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అన్నా రు. ఆదివారం ఆయన ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం రోడ్షో.. సాయం త్రం ఇంటింటి ప్రచారం నిర్వహించగా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలు చోట్ల మహిళలు మంగళ హారతులతో గోపినాథ్కు స్వాగతం పలికారు. ఎర్రగడ్డలోని వీధులన్నీ గులాబీ మయంగా మారడమే కాకుండా దాదాపు అన్ని ఇండ్లపై పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఉదయం డివిజన్లోని జేకే పాయింట్ వీధి, సాయి కాంప్లెక్స్, ఛత్రపతి శివాజీనగర్, ఆనంద్నగర్, ప్రేమ్నగర్, నందానగర్, వెంకటేశ్వర కాలనీ, బి.శంకర్లాల్నగర్ల మీదుగా జనప్రియ సమీపంలోని మైదానం వరకు రోడ్షో కొనసాగింది. సాయంత్రం ఒవైసీ గ్రౌండ్, యూపీ గల్లీ, సుల్తాన్నగర్, సౌత్ శంకర్లాల్నగర్, నేతాజీనగర్, నటరాజ్నగర్ ఫాతిమానగర్, రాజీవ్నగర్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపినాథ్ స్థానికులకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరించారు.
ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ ..అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ విజయాన్ని దుష్టశక్తులు అడ్డుకోలేవని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. 24 గంటలు నిరంతర విద్యుత్తో పాటు తాగునీటి గోసను దూరం చేసిన అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. మైనార్టీలు, మహిళలు, బీసీలు, దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలుపర్చుతున్న బీఆర్ఎస్కు పట్టం కట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. మాటలతో మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలనుకున్న పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా.. అన్నగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచి మూడోసారి బరిలో ఉన్న తనను అత్య ధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభు త్వానికి ముందు ఎర్రగడ్డ పరిస్థితి అధ్వానంగా ఉండేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని సమస్యలను దూరం చేయ డం జరిగిందని వివరించారు. డివిజన్ అధ్యక్షుడు సం జీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్, గంట మల్లేశ్, మహ్మద్సర్దార్, మహ్మద్అహ్మద్, మహ్మద్ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.