సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): జీవ వైవిధ్యంపై ఆధునిక పరిశోధనలు జరగాలని అటవీ జీవ వైవిధ్య సంస్థ (ఐఎఫ్బీ) డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జవహరి అన్నారు. బుధవారం దూలపల్లిలోని ఐఎఫ్బీలో జరిగిన ప్రాంతీయ పరిశోధన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎఫ్పీ, ఐసీఎఫ్ఆర్ఈ భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ సమావేశానికి ఐదు రాష్ర్టాలకు చెందిన 75 మంది అటవీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులు, అటవీ ఉత్పత్తులకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. రాబోయే కాలంలో చేయవలసిన అటవీ, జీవ వైవిధ్య, ఆగ్రో ఫారెస్ట్రీ, సైస్టెనబుల్ యుటిలైజేషన్ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్పీ రాంచీ డైరెక్టర్ డాక్టర్ నితిన్ కులకర్ణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.