సమీక్షలో విప్, ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్, మే 31 : సర్కారు బడులకు సకల సౌకర్యాలను కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటుకు దీటుగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం వాటి బాగుకు అదనపు నిధుల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. శేరిలింగంపల్లి మండలంలో త్వరలో పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా శాఖ ఇంజినీరింగ్ అధికారులతో విప్ గాంధీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో తొలి విడత ఎంపికైన 24 పాఠశాలల్లో సౌకర్యాలకు రూ.4.82 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రధానపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకుని అదనంగా నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కూకట్పల్లి మండలంలో 7 పాఠశాలలు ఎంపియ్యాయని, మొత్తం 31 పాఠశాలలను సౌకర్యాలపరంగా అభివృద్ధి పథంలో నడిపించుకుంటామన్నారు. నాణ్యమైన విద్యతో.. పూర్తి స్థాయి సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్ది రాష్ర్టానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. నిధుల వినియోగంపై ఆడిట్ సైతం ఉంటుందని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్యామ్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
చెక్కులు పంపిణీ..
శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి, వివేకానందనగర్, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ.23,02,668 ఆర్థిక సాయం చెక్కులను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, వెంకటేశ్ గౌడ్లతో కలిసి విప్ గాంధీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, వీఆర్వో యాదగిరి, పార్టీ నేతలు సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, కాశీనాథ్, శివరాజ్, వాసు, శిరీష, తదితరులు పాల్గొన్నారు.
సహాయనిధి చెక్కు అందజేత..
వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ కాలనీ డివిజన్లకు చెందిన నీరజ్కుమార్, నగేశ్లకు అత్యవసర శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా రూ. 6 లక్షల నిధుల మంజూరు పత్రాలను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, వెంకటేశ్ గౌడ్లతో కలిసి విప్ గాంధీ బాధిత కుటుంబాలకు అందించారు.
వైద్య శిబిరం..
ఆల్విన్ కాలనీ డివిజన్లోని మహంకాళీనగర్లో పుల్ గాస్పెల్ చర్చి, ఆశ్రయ హ్యాండ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, కాశీనాథ్, గుడ్ల శ్రీనివాస్, కెనడీ, శివరాజ్, మోజెస్, పోశెట్టి, వాసు, శ్రీనివాస్, వెంకట్, లలన్, ఇజ్రాయిల్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన
కొండాపూర్, మే 31 : నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్లో కార్పొరేటర్ హమీద్ పటేల్తో కలిసి మాదాపూర్, కొత్తగూడ, మార్తాండనగర్, అంజయ్యనగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మాదాపూర్ పత్రికనగర్లో రూ.1.80కోట్లతో చేపట్టిన పార్కు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు, అంజయ్యనగర్ రాడిసన్ హోటల్ నుంచి రోలింగ్ హిల్స్ వరకు రూ. కోటి వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు, ఫుట్పాత్ నిర్మాణ పనులు, కొత్తగూడలో రూ. 50లక్షలతో కొనసాగుతున్న యూజీడీ పనులు, ప్రేమ్నగర్లో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ రమేశ్, టీపీఎస్ రవీందర్, వర్క్ఇన్స్పెక్టర్ వెంకటేశ్, నాయకులు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.