సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో నగరంలోని మచ్చ బొల్లారం, దుండిగల్, నాచారం, కీసర తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం కొంత చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు, గాలిలో తేమ 75 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.