హైదరాబాద్: ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డెబిట్ కార్డు లేకుండానే దుండగులు నగదు స్వాహా చేశారు. డెబిట్ కార్డుతో అవసరం లేకుండా.. ఓ వ్యక్తి అకౌంట్ నుంచి ఎల్బీనగర్ ఏటీఎంలో రూ.21,200 ను దుండగులు డ్రా చేశారు. అది జీడిమెట్లకు చెందిన బహదూర్ చౌదరి ఖాతా. అతడి ఖాతా నుంచి డెబిట్ కార్డు లేకుండానే దుండగులు నగదు అపహరించారు. తన అకౌంట్లో డబ్బులు కట్ అయిన విషయాన్ని గమనించి.. వెంటనే జీడిమెట్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.