మల్కాజిగిరి, మార్చి 29: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీపీఐ, సీసీఎంల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కృపాసాగర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, వెంకటేశ్, యాదగిరి, సాయిగౌడ్, అజీజ్, రాములు, నిరంజన్గౌడ్, దేవయ్య, వెంకటరమణ, ఆనందరావు, ఖాసీం, చంద్రశేఖర్, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.