ఘట్కేసర్,మార్చి23: మున్సిపాలిటీ పరిశ్రుభంగా ఉండాలంటే పబ్లిక్ టాయిలెట్స్ అవసరమని భావించి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని పలు కూడళ్లు,సర్కారు దవాఖానలు, బస్టాండ్లలో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్,మున్సిపాలిటీ నిధులతో ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ. 17లక్షలతో 5 ప్రాంతాల్లో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. పోచారం మున్సిపాలిటీలో రూ. 18లక్షలతో 6 ప్రాంతాల్లో మోడ్రన్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ మున్సిపాలిటీనే లక్ష్యంగా ప్రజల సౌక ర్యం కోసం ఆధునిక పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశాం.మున్సిపాలిటీ, స్వచ్ఛ సర్వేక్షణ్ నిధులతో వీటిని ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశాం.
-ముల్లి పావనీ జంగయ్య యాదవ్ చైర్పర్సన్ ఘట్కేసర్ మున్సిపాలిటీ.