బన్సీలాల్పేట్, మే 12 : గాంధీ దవాఖానలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. వందలాది మంది రోగులు, సాధారణ ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఉండే గాంధీ దవాఖానలో అనుకోకుండా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతారు.
అలాంటి సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, రోగులను సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి, మంటలను, పొగను ఎలా అదుపులోకి తీసుకురావాలి అనే అంశాలను వివరించారు. రోబో యంత్రాలతో హైస్పీడ్ ప్రెజర్తో నీటిని ఎలా స్ప్రే చేస్తామో చూపించారు. సహాయ జిల్లా ఫైర్ అధికారి భానుప్రతాప్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పి.రమేశ్, షౌకత్ అలీ, బిక్షపతి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.