అంబర్పేట, ఆగస్గు 20 : నల్లకుంట డివిజన్ విద్యానగర్ టీఆర్టీలో గల మోతె నాగేశ్వరరావు పార్కుతో పాటు వాలీబాల్ గ్రౌండ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెన్నార్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడాకారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. వాలీబాల్ గ్రౌండ్లో ఆడుకునేందుకు వీలుగా ఎర్రమట్టి, వాలీబాల్ నెట్, బెంచీలు తదితర సామాగ్రి, చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
వారి వినతికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే గ్రౌండ్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాలనీవాసులు రెనా, కార్తీక్, రోహిత్, ఎస్.నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.