సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న ఎంఎన్జే దవాఖాన వైద్యులను వైద్య, ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. క్యాన్సర్ వచ్చిందంటే..మరణశాసనంగా భావించి జీవితంపై ఆశలు వదులుకున్న ఎంతో మందికి ఎంఎన్జే వైద్యులు కొత్త జీవితాలు ఇస్తున్నట్లు డాక్టర్ రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ జయలత, ఆర్ఎంవోలు డాక్టర్ నిర్మల, డాక్టర్ శ్రీనివాస్ తదితరులను ఘనంగా సన్మానించారు.