సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): నిర్వహణ కారణాలతో సోమవారం పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లింగంపల్లి-హైదరాబాద్-రామచంద్రాపురం- ఫలక్నుమా రూట్లలో మొత్తం 19 సర్వీసులను రద్దు చేశామన్నారు.