వనస్థలిపురం/చంపాపేట, మార్చి 24: పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు పోలీస్స్టేషన్ రోడ్ల పక్కన ఎండ్ల తరబడి ఉన్నాయని, స్థానికులు తమకు ఫిర్యాదు చేశారని, వాటివల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు అపరిశుభ్రత ఏర్పడుతుందన్నారు. వెంటనే వాటిని తరల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏసీపీ పురుషోత్తంరెడ్డికి ఎమ్మెల్యే ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చింతల రవికుమార్, శ్రీధర్గౌడ్, సంజయ్ కుమార్, రమణ, ఆనంద్రాజ్, సంతోశ్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు హాజరుకావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి ఆలయ పాలక మండలి ఆహ్వాన పత్రిక అందజేసింది. శుక్రవారం ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆలయ పాలక మండలి చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాస శర్మ, ఆలయ ధర్మకర్తల సంయుక్త ఆధ్వర్యంలో కలిసి శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే ఏప్రిల్ 6న జరిగే హనుమన్ జయంతికి సైతం ఆలయాన్ని సందర్శిచాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చేగోని మల్లేశ్ గౌడ్, నర్రె శ్రీనివాస్, చలమల యాదిరెడ్డి, చోలాకార్ అనిత, ఇమ్మిడి జంగయ్య, అఖిల మధుసాగర్ తదితరులు పాల్గొన్నారు.