హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ( MLC Surabhi Vanidevi ) పిలుపునిచ్చారు. జాతీయ వాస్కులర్ డే (National Vascular Day
) సందర్భంగా వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్లోని దుర్గం చెరువు వద్ద ‘వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఏ స్మైల్’ కాన్సెప్ట్తో వాకథాన్ (Walkathon) ను నిర్వహించారు. వాకథాన్ను ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎస్ రావు, వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పీసి గుప్తాతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ( Healthy society) నిర్మించి రోగం లేని సమాజాన్ని కోరుకుందామని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నట్లు చెప్పారు. అందరూ మొబైల్ ఫోన్లు (Mobile Phones ) , కంప్యూటర్లకు (Computers) అతుక్కుపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో రెండు కిలో మీటర్ల దూరం అవలీలగా నడిచేవారని, ఇప్పటి పిల్లల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి రోజు ఆరోగ్యంగా ఉండటానికి రోజు వారి నడక ఎంతో ముఖ్యమన్నారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోకరంగా ఉందని అభినందించారు. వాస్కులర్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఏసీపీ కేఎస్ రావు అన్నారు. భారతదేశం మధుమేహ