బేగంపేట్ ఫిబ్రవరి 27: పేద, మద్య తరగతి ప్రజలకు చేయూతను అందించాలనే సదుద్దేశంతో మాజీ నాటి సీఎం కేసీఆర్(KCR) కల్యాణలక్ష్మి( Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani) అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కొండంత అండగా నిలిచినట్లయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణ శ్రీనివాస్గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.