హైదరాబాద్ : గుడిసె వాసులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్లోని దాసారం బస్తీ గుడిసె వాసులపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాసారం బస్తీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్న వారిని వెళ్లగొట్టి స్థలం ఆక్రమణ కోసం ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల గుడిసె వాసుల జోలికి వెళ్లవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అయినా కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.