హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలుసతమతం అవు తున్నారు. వాటిపై దృష్టి సారించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎలాంటి సర్చ్ వారెంట్లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న గృహప్రవేశాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.