హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లేసి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. గురువారం బేగంపేటలో సికింద్రాబాద్ పార్లమెంట్(Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్తో(Padmarao goud) కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నిత్యం అందుబాటులో ఉండేవారు, అభివృద్ధికి కృషి చేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. పద్మారావు గౌడ్ నిత్యం ప్రజల మధ్యన ఉండే మనిషి అన్నారు. స్థానికంగా ఉంటూ ప్రజల కష్టాలను పరిష్కరించడంలో ముందుండే మంచి నాయకుడిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు.